ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక
మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని
జై భారత వాయిస్, కుందుర్పి
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న జామీయా మసీదులో ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ సోదరులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులు వారి సాంప్రదాయం ప్రకారం సన్మానం చేయడం జరిగింది.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులు, కుందుర్పి మైనార్టీ సోదరులు పాల్గొన్నారు