జై భారత్ వాయిస్ రంగశాయిపేట
గ్రేటర్ వరంగల్ నగరం 42వ డివిజన్ రంగశాయిపేటలోని 200 బూత్ నెంబర్ లో మహంకాళి వీధి నందికుంటలో మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ కేడల పద్మ జనార్ధన్, మంథని సునీత, కర్ర కుమార్, బొల్గుడ్డు అనిల్, దామరకొండ కర్ణాకర్, పాలకుర్తి సుమన్ , సోమ అనిల్, నేరెళ్ల అరుణ,శివ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే తెలంగాణకు అధిక నిధులు కేటాయించే అధికారం ఉంటుదన్నారు.

previous post