April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

ఆత్మకూరు, దామెర ఉమ్మడి మండలాల ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఎన్నుకోవడం జరిగింది
ఈ కమిటీ ఎన్నికకు తెలంగాణ ధూప దీప నైవేద్య సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆదేశాలతో ఆత్మకూరు మండల కేంద్రము లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆత్మకూరు, దామెర మండలాల సంయుక్త సమావేశం ను నిర్వహించారు.
సంయుక్త మండల కమిటీ అధ్యక్షులుగా కొలనుపాక వీర మల్లయ్య
ప్రధాన కార్యదర్శులు లేదల్ల శ్రీనివాసులు, కొట్టురి సుధీర్ కుమార్, కోశాధికారి ఆరుట్ల మాధవ మూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరి కాల పరిమితి రెండు సంవత్సరాలు. ఈ కమిటీ నియామకానికి సహకరించిన రెండు మండలాల ధూప దీప నైవేద్య అర్చకులకు నూతన కమిటీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల మధుకర్ శర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వచ్చు నూరి రవీందర్ శర్మ, జిల్లా అధ్యక్షుడు సిద్ధాంతి గణేష్ కుమార్, పరకాల డివిజన్ అధ్యక్షుడు కొలనుపాక భాస్కర శాస్త్రి, రెండు మండలాల అర్చకులు పాల్గొన్నారు.

Related posts

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

24×7ప్రజలకు అందుబాటులో వుంటూ సేవలందిస్తాం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌