Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రైమ్ వార్తలువరంగల్ జిల్లా

హశిష్ మత్తు మందుతో పోలీసులకు పట్టుబడిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్

జై భారత్ వాయిస్ వరంగల్
అతి ప్రమాదకమైన హశిష్ మత్తు మందును స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడు నుండి సుమారు 4లక్షల 50వేల రూపాయల విలువైన తొమ్మిది వందల గ్రాముల గంజాయి ఆకుతో తయారు చేసిన హశిష్ మత్తు పదార్ధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు అంతర్ రాష్ట్ర స్మగ్లర్ కాకినాడ జిల్లా, ఏళేశ్వరం ఎర్రవరం కు చెందిన చింతల వెంకట రాజు అలియాస్ బాబీ, వయసు 34, ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థంతో హంటర్ రోడ్ లోని ఏడు మోరిల ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మట్టేవాడ పోలీసులు తెలంగాణ నార్కోటిక్ అనాలాసిస్ విభాగం అధికారులతో కల్సి మత్తు పదార్ధంను విక్రయించేందుకు సిద్ధంగా వున్న నిందితుడిని అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా నిందితుడి వద్ద నిషేధిత మత్తు పదార్ధం హశిష్ గుర్తించిన పోలీసులు పంచుల సమక్షంలో మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు

Related posts

గాంధీ జయంతి వేడుకలు

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము