Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పవర్‌ప్రిడ్‌’లో కొండచిలువ కలకలం

దామెర, మండలంలోని: ఒగ్లాపూర్ గ్రామంలో పవర్‌డిడ్ కార్పొరేషన్ ఆవరణలో శనివారం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆవరణలో సిమెంట్ దిమ్మెల నుంచి అకస్మాత్తుగా ఓ కొండచిలువ వెళుతూ కనిపించింది. అయితే అప్రమత్తమైన పవర్డ్ సెక్యూరిటీ స్టాఫ్ జి. మనోహర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొండచిలువను స్నేక్ క్యాచర్ సాయంతో ఓ సంచిలో బంధించాడు. ఆ తరువాత జూనియర్ ఇంజనీర్ సంపత్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి. అశోక్ తమ సిబ్బంది స్వామి, కొమురయ్యతో పాటు అక్కడికి చేరుకోగా అధికారులు ఆ కొండచిలువను అప్పగించారు. ఈ సందర్బంగా పవర్డిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీజీఎం సమ్మయ్య దాసరి, జూనియర్ ఇంజనీర్ సంపత్, కార్యాలయ సిబ్బంది జి. మనోహర్, కె.ఎస్.రాములు, ఎస్.కె. ఖాదర్, బి.రాజుకుమార్, డి.విష్ణు, ఎన్.కుమార్ ఉన్నారు.

Related posts

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి

పంచలింగాల శివాలయం అద్భుతం

మాజీ ఎమ్మెల్యే సమక్షం లో బిజెపి లో చేరిక

Jaibharath News