ఎర్రంపల్లి లో ట్రాన్స్ఫార్మర్ లోని రాగి, కాఫర్ చోరీ
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంఎర్రంపల్లి లో రైతు కొల్లి సత్యనారాయణ చౌదరి ( టీడీపీ నాయకుడు) తోటలో సోమవారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి అందులోని రాగి తీగలు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఎర్రంపల్లి , గరుడాపురం మధ్యలో వ్యవసాయ క్షేత్రంలో సిమెంట్ దిమ్మెపై ఉంచిన ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ తప్పించి కిందకు తోచేసి, పగులగొట్టి అందులోని రాగి తీగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు సత్యనారాయణ కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఇటీవల కాలంలో ట్రాన్స్ఫార్మర్ల లోపల ఉన్న రాగి తీగలను ఎత్తుకెళ్లే దుండగులు అధికమయ్యారని పోలీసులు నిగా ఉంచి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.