జై భారత్ వాయిస్ హన్మకొండ
తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలోనికి ముందుకు పోతుందని, ఇంకా విద్య వైద్య, వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో మరింత పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని దీనికంతటికి మనందరం కట్టుబడి ఉండాలని, పనిచేసే ప్రతి వ్యక్తి అంకితభావంతో పనిచేయాలని అని అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉత్తర తెలంగాణలోని మొట్టమొదటి విద్య కేంద్రం అని, ఈ కళాశాలలో పీవీ నరసింహారావు వంటి మహానుభావులు చదువుకున్న భూమి అని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారని, సాధించుకున్న తెలంగాణను దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకొనుటకు మనందరం నిరంతరం కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పుల్లా రమేష్, అసిస్టెంట్ రిజిస్టర్ అశోక్ బాబు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రమేష్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీదేవి, మాధవి, రమేష్, స్వామి, నాగయ్య, భాస్కర్, గిరి ప్రసాద్, కొమురయ్య బోధనేతర సిబ్బంది రాజు, సుశీల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post