April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లిహన్మకొండ జిల్లా

విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ


జై భారత్ వాయిస్ దుగ్గొండి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక  స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు.  పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేదరి పద్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయురాలు నిర్మల, అంగన్వాడీ టీచర్ గ్రేస్, మహిళా సంఘం విఓఏ అంబరగొండ మధురాబాయి పాల్గొన్నారు.
  ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు తమ స్వంత ఖర్చులతో నోటు బుక్స్ సమకూర్చిన మహిళా సంఘాల వారికి ధన్యవాదాలు తెలిపారు.  గ్రామంలోని మహిళలంతా ప్రైవేటు స్కూల్ బస్సులను గ్రామంలోకి రాకుండా, తమ ఊరి పాఠశాలను బతికించుకోవాలని తద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, సత్ప్రయోజనాలను పొందాలన్నారు

Related posts

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

దేశ రక్షణలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుండాలి-కుటుంబ ప్రబోధన్ విభాగ్ సంయోజక్ లక్ష్మణ సుధాకర్

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం