Jaibharathvoice.com | Telugu News App In Telangana
నిజామాబాద్ జిల్లా

నీటి శుద్ధికరణ ప్లాంట్ ని పైడి ఎల్లారెడ్డి ప్రారంభించారు

జై భారత్ వాయిస్ నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని సిద్దపూర్ గ్రామస్తుల కోరిక మేరకు నీటి శుద్ధికరణ ప్లాంట్ ని డాక్టర్. పైడి ఎల్లారెడ్డి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దపూర్ గ్రామంలో నీటి ఇబ్బందిని గుర్తించి గ్రామస్తులకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామస్తులకు ఏ అవసరం వచ్చిన తప్పకుండ మా ట్రస్ట్ సహాయ సహకారాలు ఉంటాయని డా పైడి ఎల్లారెడ్డి తెలిపారు కార్యక్రమం లో సిద్దపూర్ గ్రామస్తులు బిజెపి నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్ పైడిమల్ లక్ష్మీనారాయణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.