జై భారత్ వాయిస్ న్యూస్ నూజివీడు
నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి లో ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. రాష్ట్రంలోని 65 లక్షల 18 వేల మందికి ప్రతీనెలా 4408 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గా అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో మంత్రి పార్థసారధి ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన తదనంతరం నూజివీడు పట్టణం గాంధీనగర్ఆగిరపల్లి పట్టణంలో ఇంటిటికీ వెళ్లి నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి పండుగ వాతవరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని, అనంతరం 2 వేల రూపాయలు చేశామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ను 2 వేల రూపాయల నుండి 3 వేల రూపాయలు చేసేందుకు 5 సంవత్సరాల సమయం తీసుకుందని, తమ ప్రభుత్వం 3 వేల రూపాయల పెన్షన్ ను 15 రోజులలో 4 వేల రూపాయలకు పెంచి,ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మార్చి ,ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మూడునెలల పెంచిన పెన్షన్ 3 వేల రూపాయలతో కలిపి 7 వేల రూపాయలను జులై,1వ తేదీనే అందించామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ఇకనుండి ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్ లబ్దిదారులకు వారి ఇంటివద్దే పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. పెన్షన్ పెంపుతో పేదలందరి కళ్ళల్లో ఎంతో ఆనందం కనపడుతున్నదన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి పార్థసారధి చెప్పారు. గత ప్రభుత్వం రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిందని, అయినప్పటికీ ఎంతో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనకడుగు వేయకుండా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడమే కాక రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన మానవవనరులు పెంపొందించేందుకు రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తి చేస్తామని, టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందిస్తామన్నారు. ప్రజలపాలిట శాపంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 68 వేల 353 మంది పెన్షన్ లబ్దిదారులకు 182.73 కోట్ల రూపాయలను పెన్షన్ గా అందిస్తున్నామన్నారు. తొలిరోజే నూరుశాతం పెన్షన్లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. విజయరాజు, నూజివీడు ఇంచార్జి ఆర్డీఓ ఎం. ముక్కంటి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం డయేరియా నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు మంత్రి వివరించి, డయేరియా నివారణపై ముద్రించిన పోస్టర్ ను మంత్రి విడుదల చేశారు అనంతరం ప్రజలకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు, పింఛన్ దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
