A
బాధితుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకొంటాము. ధర్మతేజ
జైభారత వాయిస్, కుందుర్పి
ఇటివల నీటి కుంటలో ఒకరు పడగా అతన్ని కాపాడడానికి వెళ్లి మరొకరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.కుందుర్పి మండల ఇంచార్జ్ దేవినేని ధర్మతేజ శుక్రవారం ఆ బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి వివిధ సమస్యలను తెలుసుకొని మిమ్మల్ని టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకొంటుందని మనోధైర్యాన్నిచ్చారు.అలాగే కొద్ది రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ (ఈనాడు )నరసింహామూర్తి భార్య వరలక్ష్మి మరణించినందున వారి కుటుంబాన్ని సందర్శించి సంతాపం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు