జై భారత్ వాయిస్ నూజివీడు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను,ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా, ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించించారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

previous post