జై భారత్ వాయిస్ ఏలూరు: జూలై 13 : ఏలూరు పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాజధాని అమరావతి సమీపంలో ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని దానికి కావాల్సిన విద్యుత్ ప్రత్తిపాదనలు తయారు చేసి పంపాలి అని అధికారులకు ఆదేశించడం జరిగింది.జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జరిచేసారు. ఇతర సమస్యలు అడిగితెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఎస్ఇ సాల్మన్ రాజు, ఇఇ రాధాకృష్ణ, డి ఇ నటరాజన్ మరియు పలువురు డివిజనల్ ఇంజనీర్లు పాల్గొన్నారు
