A
పీర్లస్వామి అగ్నిగుండంలో వెలుగుతున్న నిప్పు కలకాలం
జై భారత వాయిస్, కుందుర్పి
రేపిందిగత సంవత్సరం మట్టితో మూసిన గుండంలో వెలుగుతున్న అగ్ని. కుందిర్పి మండలం ఎనుముల దొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లి గ్రామంలో పీర్లస్వామి అగ్నిగుండంలో మహిమ బుధవారం వింత చోటు చేసుకుంది.సాధారణంగా కట్టె కాలిన తర్వాత నిప్పుపై మట్టిని వేస్తే ఆరిపోతుంది.అలాంటిది నేడు పీర్లస్వామి అగ్నిగుండాన్ని గత సంవత్సరం మట్టితో కప్పి వేసిన అగ్నిగుండాన్ని మంగళవారం మొహరం పండుగ సందర్భంగా తవ్వగా ఇప్పటివరకు అగ్గి వెలుగుతూనే ఉండటం ప్రజలను ఆశ్చ్యర్య పరిచింది.అదేవిధంగా ఇదంతా దేవుడి మహిమకు తార్కాణమని నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు దేవుడిగా నిష్టతో చేసే ఈ మొహరం పండుగ ఎంతో ఉత్సాహంగా జరగాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.