April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఉప కేంద్రాల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినదని మండల వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు  పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వైద్య శిబిరము నందు జ్వరంతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న  గ్రామాల ప్రజలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో  అన్ని ఉప కేంద్రాల డాక్టర్లు,  సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి, సూపర్వైజర్లు కిరణ్ కుమార్, స్వరూప ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

ఆర్థిక సహాయం అందజేత

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్