నూజివీడు: జై భారత్ వాయిస్ ‘ రెండు రోజులనుండి ఎడతెరుపులేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి కొలుసు పార్థసారధి ప్రజలకు విజ్ణప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలకు భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే మా కార్యదర్శి దృష్టికి తెలియజేయాలని సూచించారు. తెలియజేసిన మరుక్షణమే సంబంధించిన అధికారులకు అదేశించి తక్షణ చర్యలు చేపడతామని అన్నారు. వరదల సమయంలో ముఖ్యంగా కలుషిత నీరు త్రాగడం ద్వారా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉంది విద్యుత్ స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం భారీ చెట్లు విరగడంతో రవాణా అంతరాయం కలగడం ప్రమాదాలు జరగడం మరియు విష సర్పాలు ఇళ్లలో ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆహార కొరత ఉన్న మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన ఎటువంటి ప్రమాదం ఎదురైన వెంటనే మంత్రివర్యుల కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని 24 గంటలు మా సిబ్బంది మంత్రివర్యుల క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వారియొక్క సేవలు వినియోగించుకోవలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు, వరదలకు సంబంధించిన పలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రభుత్వ శాఖల ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ అధికారుల్లో ముఖ్యంగా వైద్య, రెవెన్యూ, విద్యుత్, రవాణా శాఖ, ఆహార భద్రత, N D R F, శాఖల కు సంబంధించి అధికారులందరూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఏ విధమైన ఇబ్బందులకు గురికాకుండా కాపాడడానికి సంసిద్దంగా ఉన్నారని నా నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజానీకం ఆధర్యపడకుండా వారి సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
24 గంటలు అందుబాటులో మంత్రివర్యుల కార్యదర్శి ఫోన్ చేయవలసిన నెంబర్: 8522007645, 90526 44606