Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

కేంద్ర బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు కూటమి ప్రభుత్వ విజయం

ఏలూరు: జూలై 23 : జై భారత్ వాయిస్ ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపుల పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి 15 వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సహాయం, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, హైద్రాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ది, పూర్వోదయ పధకం ద్వారా ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులు, రాజధాని అమరావతి అభివృద్ది కి,పోలవరం నిర్మాణానికి హామీ, విశాఖ-చెన్నై కారిడార్ లో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేక సాయం,పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి, ఓర్వకల్లుల అభివృద్ధి, నీరు, రైల్వే,విద్యుత్,రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధుల కేటాయింపులు సాధిస్తున్నామంటే ఇది కూటమి ప్రభుత్వం వలనే సాధ్యమయిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల కంటే ముందు పుట్టా మహేష్ కుమార్  వివిధ శాఖల మంత్రులను అలాగే సహచర ఎంపీలతో కలసి పోలవరం ప్రాజెక్టు నిధులకోసం ప్రయత్నించిన విషయం తెలీసిందే.

Related posts

పోలవరం ప్రాజెక్ట్ పై గళం వినిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

KATURI DURGAPRASAD

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు: మంత్రి కొలుసు పార్థసారథి

విషయం: నాగిరెడ్డిగూడెంలో డెంగ్యూ మరణంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణ స్పందన

KATURI DURGAPRASAD