<span;>జై భారత్ వాయిస్ ఢీల్లీ
<span;>తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతి శనివారం నాడు రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో పది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు ఇందులో ఏడుగురు కొత్తవారుకాగా ముగ్గురు ఇతర రాష్ట్రాలకు గవర్నర్గా చేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈయన త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు త్రిపుర రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 15ఆగస్టు 1957లో జన్మించారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా సేవలందించారు రామ జన్మభూమి ఉద్యమంలో 1990లో బిజెపి పార్టీలో చేరారు పార్టీలో పనిచేస్తూ త్రిపుర ప్రభుత్వంలో రెండవ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు