Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

సమస్యల పరిష్కారం కోసం అధికారులకు లేఖలు రాసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

ఏలూరు ;జూలై 30;జై భారత్ వాయిస్’   కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామ శివారు వెంకాయపాలెంలో పాడైవ రోడ్లు,డ్రైనేజీ ల మరమ్మతులు  గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించటానికి అవసరమైన చర్యలు తీసుకుని ,అంచనాలు సిద్దంచేసి, సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని,తీసుకున్న చర్యలను 15 రోజుల్లో తెలియ చేయాలని యంపి పుట్టా మహేష్ కుమార్ జిల్లా పంచాయతీ ఎస్ఈ కి లేఖ వ్రాశారు .అంతకు ముందు వెంకాయపాలెం గ్రామ నివాసి గోపిన ఉమామహేశ్వరి సోషల్ మీడియా ద్వారా తెలిపిన సమస్య పై యంపి పుట్టా మహేష్ కుమార్ స్పందించడం విశేషం.కామవరపుకోట మండలం కళ్ళచెరువు-రంగాపురం మద్యన శిధిలమైన వంతెన స్థానం లో గుండేరు వాగుపై కొత్త వంతెన నిర్మించాలని,ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కామవరపుకోట లింగపాలెం,చింతలపూడి మండలాలకు రవాణా సౌకర్యాలు,ముఖ్యంగా రైతులు పండించిన పంటల రవాణా మెరుగు పడతాయని,అంతేకాకుండా తెలంగాణా రాష్ట్రం నుండి నూజివీడు,చింతలపూడి మీదుగా ద్వారకాతిరుమల ఆలయం చేరుకోవటానికి ప్రధాన మార్గం కాబట్టి ప్రాధాన్యత ప్రతిపాదికన పరిశీలించి, నూతన వంతెన మంజూరు కు అవసరమైన చర్యలు మరియు అంచనాలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు లేఖ ద్వారా తెలియచేశారు.సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఏలూరు వాసి జుబేర్ ను కాపాడాలని ,పత్రికల లో ప్రచురితమైన వార్తలకు స్పందించిన యంపి పుట్టా మహేష్ కుమార్ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ని కోరతూ ఈ మేరకు లేఖ వ్రాశారు.

Related posts

కేంద్ర బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు కూటమి ప్రభుత్వ విజయం

KATURI DURGAPRASAD

నూజివీడు ఆగస్టు: 26 వైరల్ జ్వరాలపై అపోహలు వద్దు మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి.

KATURI DURGAPRASAD

#Eluru ఏలూరు జిల్లా అభివృద్దే లక్ష్యంగా గ్రామ సభలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ

Sambasivarao