జై భారత్ వాయిస్ గీసుకొండ గీసుకొండ.మండలములోని జాతీయ ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లి, మరియపురం గ్రామాల్లో కేంద్ర సచివాలయ గ్రూప్ వన్ అధికారుల బృందం సభ్యులు రెండవ రోజు వ్యవసాయ క్షేత్రాలు, ఉపాధి హామీ పథకం లో చేపట్టిన పనులను స్తానిక మండల అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. గంగదేవిపల్లి లో పట్టు పురుగుల పెంపక ప్రక్రియ ను, మరియాపురం లో ఉపాధి హామీ లో చేపట్టిన పoడ్ల తోటల పెంపకాన్ని పరిశీలించి అధిక దిగుబడికి రైతులు అనుసరిస్తున్న పద్ధతుల గురించి స్తానిక రైతులను, వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం లో చేపట్టిన ఇంకుడు గుంతలు, రుప్ హార్వెస్టింగ్ సిస్టం,బోర్ రీచార్జ్ పిట్, వైకుంఠ దామం,నర్సరీ, పల్లె ప్రకృతి వణాలను సందర్శించారు. అనంతరం రెండు గ్రామాల్లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖాముఖి మాట్లాడారు.ఈ కార్యక్రమములో ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ అడేపు ప్రభాకర్, టీం సభ్యులు విక్రాంత్ పునీయ,అమిత్ కుమార్ బార్టి,ప్రదీప్ గుర్జర్,అమిత్ కుమార్, సత్యం సింగ్ పాల్, యండి. ఆశ్రాఫ్, అంకిత్ సింగ్, రోనాక్ త్యాగి, ప్రత్యూష్ తివారీ,అమన్ జంగ్ర, టీం ఇంఛార్జి లు జెల్ల సుధాకర్, రమేష్, డిటిఎం కూసం రాజమౌలి, ఏవో లు హరిప్రసాద్ బాబు,అరవింద్,ఏ ఈ వో రజినీ, యన్ ఐ అర్డి నుండి శేఖర్, ఏపివో చంద్రకాంత్,ఈసి శ్రీలత, టి ఎ సుష్మా, ఓంకార్,పంచాయితి కార్యదర్శులు శ్రీధర్, సరిత, స్వప్న,రైతులు ఎరుకల మోహన్, కౌడగాని రాజు, దిలీప్ రెడ్డి,రాజు,చెంచ్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

next post