Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ముందంజ

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు: రిపోర్టర్ అశొక్)ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజలో ఉందని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పీఆర్టియు సంఘం అధ్యక్షులు నకిరెడ్డి మహేందర్ అన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడ పెల్లి పాఠశాలలో పిఆర్టియు సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇప్పించిన ఘనత పిఆర్టియు సంఘానికి దక్కుతుందని అన్నారు. పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి నిత్యం ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు .ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించుటకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనముల రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకు వెళ్లారని ఆయన తెలిపారు. ఈ సమస్యను సాధిస్తే అర్హులైన ఉపాధ్యాయులకు ఎంఈఓ, డిప్యూటీ ఈ వో ,జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్లు లభిస్తాయని ఆయన వివరించారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు ,నగదు రహిత కార్డులో సాధించేందుకు పిఆర్టియు ఉపాధ్యాయుల పక్షాన కృషి చేస్తున్నదని చెప్పారు .మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదులో ముందు వరుసలో ఉన్నదని ఆయన చెప్పారు. నల్లబెల్లి మండలంలో 153 మంది ఉపాధ్యాయులకు సభ్యత్వం అందించామని ఆయన వివరించారు. నల్ల బెల్లి మండలంలో ఉపాధ్యాయుల కొరత ఉన్నదని ఇంకా 43 మంది ఉపాధ్యాయులు అవసరమని ఆయన పేర్కొన్నారు. మండలంలో కస్తూరి బాలికల ఉపాధ్యాయులు ,సీఆర్టీ గిరిజన ఆశ్రమ బాలికల ఉపాధ్యాయులు, మండలంలో ఎమ్మార్ సీ లో పనిచేస్తున్న సిఆర్పిలు సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు .పిఆర్టియు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఉపాధ్యాయునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే!

పేదలకు సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ లక్ష్యం

Jaibharath News

లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ