ఏలూరు: ఆగస్టు, 07: జై భారత్ వాయిస్’ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కార్మిక సోదరసోదరీమణులకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే అని అన్నారు, చేనేత కార్మికులు కాళ్ళు, చేతులు, కాళ్ళను మగ్గాలపైకేంద్రీకరించి అకుంఠిత దీక్షతో అద్భుతంగా వస్త్రాలను తయారు చేస్తారన్నారు. ఇతర దేశాలకు చేనేత వస్త్రాలను ఎగుమతి చేయటం వలన విదేశీ మారకద్రవ్య నిల్వల సమీకరణకు తోడ్పడుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్న చేనేత రంగాన్ని టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని పుట్టా మహేష్ కుమార్ అన్నారు.