Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

జై భారత్ వాయిస్ అనంతపురం, ఆగస్టు 07 : అనంతపురం జిల్లాలోఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం పౌర హక్కుల పరిరక్షణ , అత్యాచార నిరోధక చట్టం (పిసిఆర్ & పిఓఏ యాక్ట్) పై నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ మురళి కృష్ణ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను సభ్యులు పరిశీలించి తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల ను వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని  సూచించారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజల కోసం పనిచేసే ఫ్రెండ్లీ పోలీస్  వ్యవస్థను గా పనిచేయాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ అన్నారురాచపల్లి లెదర్ ఫ్యాక్టరీ,పుట్లూరు మండలం ఎస్సీ హాస్టల్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగనమల శాసన సభ్యురాలు శ్రావణశ్రీ అధికారులను అదేశించారు

Related posts

కుందుర్పి మండలం ఎనిమల్ దొడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ మొదలైంది

Jaibharath News

టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి  మండల కార్యకర్తలు

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

Jaibharath News