Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి

సాంకేతిక విద్యలో ముందు ఉండాలి

విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు. గతంలో ఎన్నారై అనిల్ రావు ఇచ్చిన కంప్యూటర్లు ఎలా పనిచేస్తున్నాయి, విద్యార్థిను ఏం నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సీతాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో కంప్యూటర్ విద్యా అనేది తప్పనిసరి అని అన్నారు. అంతర్జాలంలో అవసరమైనటువంటి విషయాలను మాత్రమే నేర్చుకోవాలని సూచించారు . ఏది అవసరమో ఏది అనవసరమో విద్యార్థులు గుర్తించాలన్నారు. విద్యార్థులు లక్ష్యం ఏర్పరచుకొని చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్ రావు, ఉప సర్పంచ్, ఉపాధ్యాయులు రాజన్న, వెంకటేశ్వర్లు, స్వప్న కుమారి, రవీందర్, రతన్ సింగ్ రాథోడ్, అశోక్, తదితరులు ఉన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

కేసీఆర్ మనసు మార్చాలని భద్రకాళి అమ్మవారికి సమగ్ర ఉద్యోగుల పూజలు

Jaibharath News

గృహలక్ష్మి పనులకు శంకుస్థాపన

Jaibharath News