Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం*

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నది అవాస్తవం మని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండించిన వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది  కావాలని పనికట్టుకొని తమకు అమ్యామ్యాలు ముట్టలేదనే అక్కసుతో లేనిపోని అభూత కల్పనలతో ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నియోజకవర్గ ఎస్సీ విభాగం నాయకులు ఐత ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డులో ఉన్న గుబ్బెడి తండా గిరిజనులకు సరైన రోడ్డు లేక, చిన్న పాటి వర్షానికే చిత్తడిగా మారి బురదమయం కావడంతో ఇక్కడి గిరిజన గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దీన పరిస్థితి నెలకొంది. గత 10 సంవత్సరాల తెరాస ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు ఎన్నోసార్లు తండా వాసులు బి.టీ రోడ్డు వేయాలని మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. దీనితో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు కేఆర్ నాగరాజు తండావాసులు పడ్డ కష్టాలను చూసి చలించి తప్పకుండా రోడ్డు వేయిస్తా అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంబందిత శాఖామంత్రి సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపించడం జరిగిందన్నారు. తండావాసుల ఎన్నో ఏళ్ల కళను నెరవేర్చి బీటి రోడ్డు పనులను చేపిస్తుంటే తండావాసులు సంతోష పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ప్రశంసించాల్సింది పోయి కొంతమంది పనికట్టుకొని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతుండటం విచారకరమని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు మల్లెపాక సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్, మండల అధికార ప్రతినిధి కందిక ఎల్లస్వామి, ఎస్సీ విభాగం పట్టణ అధ్యక్షులు చెరిపెల్లి బాబు, నాయకులు చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News

వరంగల్ జిల్లా కొర్టులో జూన్ 8న జాతీయ లోక్ అదాలత్

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

Sambasivarao