(రిపోర్టర్ జ్యోతి)
జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరం
స్త్రీ నిధి వల్ల మహిళలు వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తుల్లయ్యారని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగు పడుతుందని మంత్రి అనసూయ సీతక్క ఆకాంక్షించారు.ఇది స్త్రీనిధి సమావేశం లాగా లేదు.. చెరువుగట్టు వద్ద బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్లు వుందని11వ సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రారంభం అయిన స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సమావేశం జరిగిందిప్రవేట్ వడ్డీ వ్యాపారులు మైక్రోఫైనాన్స్ సంస్థలు మన అత్యవసరాలను అవకాశంగా తీసుకునీ వడ్డీ బారాలు మోపేవారు
వడ్డీ బారాలు తట్టుకోలేక ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొప్పుల రాజు, వాకాటి కరుణ వంటి ఉన్నాతాధికారుల సూచనలతో స్త్రీనిదిని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళల ఆర్థిక ప్రగతి ఆ సమాజ ప్రగతి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు.మా ప్రజా ప్రభుత్వం తూచ తప్పకుండా అంబేద్కర్ ఆలోచనలను ఆచరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. మహిళలు గతంలో బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడేవారు
బ్యాంకులకు వెళ్లిన మహిళలను చిన్నచూపు చూసేవారు వాటిని అధిగమించి మహిళా సంఘాలు కట్టి ఆర్థికంగా బలోపేతమయ్యారు ప్రభుత్వ సంస్థలకు, బ్యాంకులకు ఆర్థిక సహాయం చేసే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయి ప్రవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు.. స్త్రీ నిధి ముద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం మహిళల ఆర్థిక ప్రగతి కోసం హామీలను అమలు చేస్తున్నామన్నారు 500 కి గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం మహిళల కోసం అమలు చేస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణాన్ని అవహేళన చేస్తూ వీడియోలు రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మహిళా సాధికారతను తట్టుకోలేక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బస్సుల్లో అల్లికలు చేస్తూ, ఎల్లిపాయ పొట్టు తీస్తే తప్పా? మహిళలకు ప్రభుత్వం చేయూతగా నిలిస్తే ఎందుకంత అక్కసు? అని అన్నారు

మహిళా లోకం ఆలోచించాలి ….
తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ మార్గదర్శకంలో మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది మహిళా సంఘాలు అంటే సమాజంలో గౌరవం పెరిగిందని గ్రామీణ స్థాయిలో 63 లక్షల మందిని మహిళా సభ్యులుగా చేర్పించారనిఆర్థిక అంశాలతో పాటు మహిళా రక్షణ కోసం మహిళా సంఘాలు పనిచేయాలి సూచించారు.వేధింపుల నుంచి మహిళలకి మహిళా సంఘాలు విముక్తి కల్పించాలని ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించేలా మహిళా సంఘాల పని చేయాలని మహిళల్లో అభద్రత పోగొట్టేలా త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆడవాళ్లు లేకుంటే సృష్టి లేదు అనే ఆలోచన పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఎన్కౌంటర్లతో మార్పు రాదు..
వరంగల్ దిశ ఎన్కౌంటర్లతో సమాజం మారలేదు అందుకే పాఠశాల గదుల్లోనే మార్పు మొదలయ్యేలా పాటాలు బోధిస్థాంప్రజల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వం చేసే కృషికి మహిళా సంఘాలు తోడుగా నిలవాలని సూచించారు లక్షల మంది మహిళలను కాంగ్రెస్ లక్ష్యాధికారులను చేసింది అలాగే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందని సమాజం సంతోషంగా ఉండాలంటే కుటుంబం సంతోషంగా ఉండాలనిమహిళా ఉన్నతి తోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందని చెప్పారుఅందుకే మహిళా ఆర్థిక స్వావలంబన కోసం శిల్పారామంలో నైట్ బజార్ ను ప్రారంభించాంఅమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశాక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి యూనిఫామ్ కుట్టు పనులను మహిళా సంఘాలకు అప్పజెప్పాముజత కుట్టు కూలీని రూ. 50 నుంచి 70 రూపాయలకు పెంచామని మహిళా శక్తి క్యాంటీన్ లను సచివాలయంలో ప్రారంభించాంజిల్లాలో కూడా ఈ క్యాంటీన్లను విస్తరిస్తున్నాము 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తున్నామని స్త్రీనిధి వంటి బ్యాంక్ ను ఏర్పాటు చేసిన మహమ్మద్ యునస్ బంగ్లాదేశ్ ప్రధాని అవుతున్నారని పేర్కొన్నారు మనమంతా ఒక కుటుంబంగా పనిచేద్దాం మహిళా సంఘాలకు రూ. 2 లక్షల రుణబీమా రూ.10 లక్షల ప్రమాద బీమా ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందనివిజ్ఞానాన్ని పంచితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది మహిళా సంఘాల్లో లేని మహిళలను సభ్యులుగా చేర్చేందుకు మహిళ సంఘాలకు పనిచేయాలని కొరారు
సమాజంలో మహిళ భద్రత కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తాం స్త్రీనిధి భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందనిస్త్రీనిధి భవనం కోసం హైదరాబాదులో భూమిని కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారుపేదలకు చేయూత ఇవ్వాల్సింది ప్రభుత్వాలే అందుకే పేద ప్రజలకి అండగా మా ప్రభుత్వం నిలుస్తుందనిప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అందుకే మహిళల మీద నేరాలు జరక్కుండా ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతాం మంత్రి భరోసా ఇచ్చారు.