A
వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి
జై భారత వాయిస్,కుందుర్పి
వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలినేడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ఈ వ్రతంలో పూజ పూర్తైనాక ముత్తైదువులకు వాయనం ఇస్తుంటారు. ఈ వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్ ముక్కలు, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము ఉండేలా చూడాలి. ఈ వాయనాన్ని ఇచ్చేముందు ఇంటికి పిలిచిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూయాలి. పాదాలకు పసుపు రాయాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. ఆ తర్వాత వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.