జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ జిల్లా ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోనే కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కొండా మురళీధర్ రావుని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తులు చేశారు. మురళీధర్ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంతవరకు సమస్యలను ఫోనులోనే పరిష్కరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి కానీ మంత్రి దృష్టికి కాని తీసుక రావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు.
