వరంగల్ జిల్లా//పుప్పాల గుట్ట
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ తూర్పు ప్రతినిధి:-తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు. వరంగల్ జిల్లా పుప్పాలగుట్టలో నివాసం ఉంటున్న తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం (79) అనారోగ్యంతో మరణించినారు. వీరికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన, విశ్వనాథము మాస్టరు ను ఆదర్శంగా తీసుకొని అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. కొంతమంది తన శిష్యులు విదేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ముఖ్యంగా తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషిచేశారు. ఈ సందర్భంగా 1990-91 బ్యాచుకు చెందిన పదవ తరగతి చదివిన ఎలుకుర్తి హవేలీ విద్యార్థులు బొల్లం కుమారస్వామి, ముదిగొండ శ్రీనివాస్, శ్రీరామ్, తిరుపతి, సూరం భాస్కర్, రాజన్న, భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
