Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఉచిత వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం ఉకల్ హవేలీ , మచ్చాపూర్ లో శుక్రవారంగ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం ఇంచార్జ్ వైద్యాధికారి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుత కాల కాలానుగుణంగా సీజనల్ వ్యాధులను తెలుసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమైనది. ఈ శిబిరం నందు జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షల నిమిత్తం రక్త నమోనాలను సేకరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలను పరీక్షించి వారికి సంబంధించిన వ్యాధులకు అనుగుణంగా ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎంలు డి. సదాలక్ష్మి, పి. సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ జె. శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎలగం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

సర్పంచ్ ఏకగ్రీవం సొంత పైసలతో బొడ్రాయి పండగ. ఇంటింటికి రూ. 1000

Sambasivarao

గీసుకొండలో గ్రామపంచాయతీలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు

Sambasivarao