Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఉచిత వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం ఉకల్ హవేలీ , మచ్చాపూర్ లో శుక్రవారంగ్రామపంచాయతీ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం ఇంచార్జ్ వైద్యాధికారి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుత కాల కాలానుగుణంగా సీజనల్ వ్యాధులను తెలుసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమైనది. ఈ శిబిరం నందు జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షల నిమిత్తం రక్త నమోనాలను సేకరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలను పరీక్షించి వారికి సంబంధించిన వ్యాధులకు అనుగుణంగా ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎంలు డి. సదాలక్ష్మి, పి. సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ జె. శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలి

Sambasivarao

ఇల్లంద గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు*

Sambasivarao