జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 17 వరంగల్ తూర్పు ప్రతినిధి:-కరెంట్ పోయిందని ఫోన్ చేస్తే మద్యం మత్తులో బూతులు తిట్టిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను వరంగల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ మధుసూదన్ రావు ఉత్తరువులు జారీ చేశారు.విధి నిర్వహణలో అసభ్యకరంగా వ్యవహారించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ పరిధిలోని ఏ.ఈ డిస్ట్రిబ్యూషన్ ఏ.జె మిల్స్ అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతిర్మయినాథ్ను సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తరువులు జారీ చేశారు. అలాగే గొర్రెకుంట సబ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న డి నరేష్ను కూడా సస్పెండ్ చేస్తూ వరంగల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ మధుసూదన్ రావు ఉత్తరువులు జారీ చేశారు.
