జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 18 వరంగల్ జిల్లా ప్రతినిధి:-ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథంనుదాత తాటికొండ మల్లేశం దంపతులు అందచేశారనిఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున దేవస్థానం ఆవరణలో దేవస్థానం ఈఓ అద్దంకి నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన దాత తాటికొండ మల్లేశం, రమాదేవి దంపతులు దేవుడి పట్ల భక్తితో పాటు కుమారుల జ్ఞాపకార్థం శ్రీశ్రీశ్రీ ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామికి ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపు రథాన్ని 70 అడుగుల టేకు కర్రతో 10 అడుగుల పొడవుతో, 6.5 వెడల్పుతో తయారు చేసి ఆదివారం అందజేశారని తెలిపారు.ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రథం ధాత తాటికొండ మల్లేశం,రమాదేవి దంపతులు మాట్లాడుతూ నా కుమారులు తాటికొండ రాజు, తాటికొండ రంజితుల జ్ఞాపకార్థం తనకు ఇష్టమైన ఆరాధ్యదైవమైన దేవుడైన శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవ విగ్రహాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, ఉప అర్చకులు పాతర్లపాటి రవీందర్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

previous post