జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 18
వరంగల్ జిల్లా గీసుకొండ తాటికొండ మల్లేశం రమాదేవి దంపతులు కుమారుల జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్రం లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవోలు మల్లన్న (మల్లిఖార్జున బ్రమరాంబిక) దేవస్థానమునకు10 లక్షల రూపాయలు వ్యయంతో ఉత్సవ రథాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు హనుమకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘ అధ్యక్షుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అలుగోజు కృష్ణమూర్తి ప్రఖ్యాత లోహ శిల్పి బ్రహ్మశ్రీ పెందోట మధుసూనాచార్యులు రాష్ట్రసంఘ ఉపాధ్యక్షులు ఉమ్మడి జిల్లా కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వీణవంక సదానందం రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు పెందోటసురేష్ హనుమకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు నాగ సోమేశ్వర్ దేవస్థాన మాజీ ధర్మకర్త బ్రహ్మశ్రీ శ్రీరామోజు సతీష్ విశ్వబ్రాహ్మణలు దేవస్థానవేదపురోహితుల ఆధ్వర్యంలోపూజ*సంప్రోక్షణ,, బలిహరణాది *కార్యక్రమాలు నిర్వహించి*దేవాలయం చుట్టూ ఒక ప్రదిక్షణ చేయడం మంగళ వాయిద్యాలతో,బాణాసంచా పేల్చుతూ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం నాయకులు వెంటరాగా కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు మల్లన్న రథాన్ని భక్తుల సమక్షంలో అందచేశారు. వేద పండితుల చేత దేవాలయం లో రథశిల్పి,దాత తాటికొండ మల్లేశం దంపతులను కుటుంబ సభ్యులను దేవాలయ మర్యాదలతో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులను తాటికొండ మల్లేశం దంపతులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
