A
నీటి కుంటలో పడి దూడ మృతి
జై భారత వాయిస్, కంబదూరు
నీటి కుంటలో పడి దూడ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది వివరాలు ఎలా ఉన్నాయి కంబదూరు మండల పరిధిలోని కురాకులపల్లి గ్రామంలో గొల్ల నారాయణప్ప కుమారుడైన రామప్ప కు చెందిన ఆవు దూడ నీటి కుంట వద్దకు వెళ్లి నీరు త్రాగుతున్న సమయంలో బుడదలో ఇరుక్కొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది . దీంతో రామప్పకు లక్ష ఇరవై వేలు నష్టం కలిగినట్లు బాధితుడు మీడియాకు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.