A
4 ఎకరాల పంట నగేష్ కు నష్టపరిహారం జరిగినది
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కంబదూరు మండలంలోని జెక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మూలింటి నగేష్ అనునతనికి సంబంధించిన 3 ఎకరాల పొలంలో పెట్టిన వంకాయ పంట గత 4 రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షానికి నీట మునిగింది పూత దశలో ఉన్న వంకాయ పంట వర్షార్పణం కావడంతో ఆ రైతు కన్నీటి పర్యాంతం చెందాడు. వేలాధి రూపాయలను అప్పు తెచ్చి పంట పెడితే కురిసిన వర్షానికి నేల పాలు కావడంతో ఇక ఆ రైతుకు దిక్కు తోచక అయోమయానికి గురి అయ్యాడు ఇలాంటి రైతులు మండల వ్యాప్తంగా వందల కొద్ది ఉన్నారు కావున సంబంధించిన అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తిరిగి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా సత్వర చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారుస్థానిక ,నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులను సమన్వయపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము