వరంగల్ జిల్లా//ఎంజీఎం కూడలి
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:-భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80 వ జయంతి సందర్భంగా వరంగల్ ఎం.జి.ఎం. కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.