జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21
వరంగల్ జిల్లా టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా వరంగల్ విద్యాశాఖ అధికారిగా జ్ఞానేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ,కార్యదర్శి వేణుగోపాల్ సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓస్ యూనియన్ ముందుంటుందని అలాగే విద్యా శాఖలోనీ మినిస్టరియల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామానుజన్ జగదీశ్వర్ విద్యాశాఖా ఫోరం అధ్యక్షులు ఎస్ బి శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి రామకృష్ణ మహమ్మద్ యూసఫ్, విద్యాశాఖ ఫోరం నాయకులు బాబ్జి,నిరంజన్ రెడ్డి, మానస, నాగరాజు, సృజన్, చందు, తదితరులు పాల్గొన్నారు
