Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ఏఐకేస్ జిల్లా కార్యదర్శి. చుక్కయ్య డిమాండ్ చేశారు.హనుమకొండ పట్టణంలోని రాంనగర్ సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జిల్లా అధ్యక్షులు స్టాలిన్ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలు కలిగి ఉన్న ఎస్ఎఫ్ఐ జెండాను ఎగరవేసి ప్రారంభించారు ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు చక్రపాణి జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగం చిట్టచివరి ప్రాధాన్యంగా మారిందని సంక్షేమమైన విద్యారంగాన్ని ప్రభుత్వాలు పూర్తి ప్రైవేటుపరం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యారంగాన్ని మతోన్మాద ఊబిలోకి దించుతూ తిరోగమన దిశగా మారుస్తున్నాయని విమర్శించారు అలాగే క్లాసులకు ప్రిన్సిపల్ గా సూరం అనూష వ్యవహరించారు ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య నేటి రాజకీయ పరిస్థితులు మన అవగాహన విద్యార్థులు రాజకీయాలు అనే అంశంపై మొదటి క్లాసును బోధించారు నూతన జాతీయ విద్యా విధానంతో విద్య అంత కూడా ప్రపంచ మార్కెట్లో సరుకైందని దాన్ని కొనుక్కునే స్థాయిలో ఈ దేశం ప్రజలు లేరని అన్నారు అలాగే విద్యార్థులు యువత అంతా కూడా నేడు ప్రభుత్వాలు చేస్తున్న విచ్ఛిన్నకర రాజకీయాలను గమనించాలని వాటికి ప్రత్యామ్నాయంగా అందరికీ ఉచిత విద్య వైద్యం ఉపాధి కలిగించే సోషలిస్టు స్థాపన రాజకీయాల వైపు అడుగులు వేయాలని చుక్కయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ఇస్మాయిల్ సహాయ కార్యదర్శులు పరిమళ జస్వంత్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ ఈశ్వర్ మడికొండ ప్రశాంత్ హేమంత్ అలాగే బాధ్యులు గణేష్ సాయి రాహుల్ రాకేష్ వికాస్ మంజుల రాధిక అంజలి శ్వేత వర్షిత్ మరియు జిల్లాలోని ఎనిమిది మండలాల నుండి యూనివర్సిటీ మరియు హై స్కూల్ స్థాయి నుండి పీజీ స్థాయి వరకు చదువుతున్న 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్