Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి


జై భారత్ వాయిస్ న్యూస్ కాకతీయ యూనివర్సిటీ ఆగష్టు 23

విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు, భారతదేశం అంతరిక్షరంగంలో కుడా తన ప్రతిభ పాటవాలు చూపెడుతుంది అన్నారు, చంద్రయాన్ 3 విజయవంతం అయి ఒక సంవత్సరం పూర్తీ సందర్భంగా ఆ అపురూప సందర్భాన్ని గుర్తు చేసుకోవటం అబినందనియం అన్నారు, విక్రం సారబాయి, సతీష్ ధావన్, కస్తూరి రంగన్, ఎ.పి.జే అబ్దుల్ కలాం సేవలను గుర్తు చేసారు, అంతరిక్షంలోనికి పంపిన ఆర్యభట్ట, భాస్కరా, రోహిణి, కల్పన రాకెట్ లను గుర్తు చేసారు, ఈకార్యక్రమంలో కాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి సురేష్ లాల్, ఆచార్య టి శ్రీనివాస్, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ మంజుల, డాక్టర్ ఇస్తారి, డాక్టర్ ఎల్.పి.రాజ్ కుమార్, సహాయ రిజిస్ట్రారులు లింగంపల్లి రాము, ప్రణయ కుమారుతో పాటు గిడియనులు పాల్గొన్నారు. ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీ రాజు నేతృత్వం వహించారు, ప్లే కార్డ్స్, రంగు రంగుల బెల్లాన్ లు మరియు జాతీయ జెండాలతో అందరిని ఆకట్టుకునే విధంగా సంబరం చేసారు.

Related posts

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న రాణా ప్రతాప్ రెడ్డి

Sambasivarao

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్