జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:-
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి గాడేపల్లి నుండి కాపుల కనపర్తి వెళ్ళే దారి వసంతాపూర్ లో రోడ్డుపై హెవి వెకిల్స్ వెళ్లడం వల్ల రోడ్డు గుంతల మయం కావడంతో స్పందించిన స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు ఆధ్వర్యంలో గుంతలను పూడ్చి వేయడం జరిగింది. తమతో పాటు డివిజన్ అధ్యక్షులు కత్తెరపల్లి దామోదర్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నెల్లుట్ల కుమారస్వామి, కస్పాద బ్రహ్మచారి, యూత్ సభ్యులు గొంగళ్ళ సునీల్, జనుపాల హరీష్, కడియం శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
