Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

*దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం* జనగామ జిల్లా జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 వరంగల్ ప్రతినిధి:-

అరుదైన అపూర్వమైన కార్యక్రమం కన్నుల పండుగగా దేవాలయ ప్రధానార్చకులు ఆకాంక్ష – డాక్టర్ మోహనకృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం.దేవాలయ అర్చకుడి కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం. మన శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి. శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ మహిళా భక్తులు అందరూ కలిసి దేవాలయ ప్రధానార్చకులు. డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ధర్మపత్ని ఆకాంక్ష దంపతులకు సీమంత మహోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు..ఒక దేవాలయ అర్చకుడిని తమ కుటుంబంగా భావించి, మేము మీ పుట్టింటి వారమే అంటూ. ఈ అరుదైన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో ప్రేమానురాగాలతో చీర సారెలు, నూతన వస్త్రాలు, పండ్లు ఫలహారాలు, గాజులు పుష్పాలతో ఒడినింపి ఆప్యాయతలను పంచి, అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కాలంలో ఒక అర్చకుడికి గాని, అర్చక కుటుంబానికి గానీ ఇటువంటి గౌరవం దక్కడం ఎంతో అరుదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దేవాలయ కమిటీ సభ్యులకు, ఎంతో అభిమానాన్ని ఆప్యాయతలను చాటిచెప్పన మహిళా భక్తులకు. అర్చకులు మోహనకృష్ణ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పౌష్టిక ఆహారం అందించాలి

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు

Sambasivarao

వరంగల్ జిల్లా నూతన కలెక్టర్గా సత్య శారదా దేవి

adupashiva