జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట ఆగస్టు 25
యోగ నిత్య జీవితంలో ఒక భాగంగా సాధన చేయాలని అప్పుడే సాధకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్యా అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ హనుమకొండ జిల్లాల యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ జిల్లా స్థాయిలో క్రీడాకారుల ఎంపిక పోటీలునిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్యా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే యోగ సాధన చేయడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని అన్నారు భవిష్యత్తులో యోగా పోటీల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కైలాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు హనుమకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిర్మల మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు యోగ సాధన చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటారని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగ పోటీలో పాల్గొన్న క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేసి హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొంటారని అని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ యోగ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కిరణ్. యోగ అసోసియేషన్ కమిటీ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు, యోగా అసోసియేషన్ జిల్లా కోశాధికారి పాకాల రవిందర్, పాషా నారాయణ, హన్మకొండ లయన్స్ క్లబ్ కోశాధికారి కిరణ్మయి రజిత, జ్యోతి ప్రేమలత యోగా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

