జై భారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట ప్రతినిధి:- ఆగష్టు 26
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణుని విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, మధురాధిపతి కృష్ణ తదితర నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింహాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
