Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని సందర్శించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26
ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని రాగా ఈరోజు వారి నివాసానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి వెళ్లి పార్థీవ దేహాన్ని సందర్శించి పులమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ.రాజేష్ మృతివార్త తెలియగానే ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకవచ్చేందుకు తాను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయంతో ఫోన్లో మాట్లాడడం జరిగినదని, వారు స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా కృషి చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన రాజేష్ విగత జీవిగా తిరిగి రావడం బాధాకరమని వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.

Related posts

యువత క్రీడల్లో రాణించాలి

Jaibharath News

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News

ఇనగాల వర్సెస్ కొండా వర్గీయుల భాహి భాహి రసా బాసగా మారిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

Jaibharath News