జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26
మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. వరంగల్ ముస్లిం కమ్యూనిటీ సెంటర్ లో మైనారిటీస్ ఇంటలెక్చువల్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు కుట్టు మిషన్ లను మరియు సర్టిఫికెట్లను అందజేసారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ. మహిళకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ అనంతరం వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా సొంతంగా ఒక కుట్టు మిషన్ కూడా అందిస్తున్న ఎం ఐ ఎఫ్ సొసైటీని ఎంపీ అభినందించారు. మహిళలు నేటి కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నారని, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు స్వయం ఉపాధి రంగాలలోనూ మహిళలు తనదైన ముద్రను వేసుకుంటున్నారన్నారు. అంతే కాకుండా వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివిస్తూ, కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు అన్ని విధాల తన సహకారం అందిస్తానాని ఎంపీ తెలియజేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తూ మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ఎంఐఎఫ్ సొసైటీ వారికి సూచించారు. అవసరమైతే తన ఎంపీ ఫండ్స్ నుండి సహకారం అందిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సాధికారత సాధించాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎఫ్ అధ్యక్షులు అనీస్ సిద్ధిఖీ, వరంగల్ గ్రంథాలయ మాజీ చైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మీర్జా అజీజుల్లా షాహెద్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post