Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి వరంగల్ జిల్లా డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ఆగస్టు 26
వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు ప్రతి గ్రామంలో తండలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ తెలిపారు.జిల్లాలోని డిప్యూటీ డిఎంహెచ్వోలు ప్రోగ్రాం అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతి గ్రామములో పరిసరాల పరిశుభ్రత చేయిస్తున్నారని క్యాంపులనుఆరొగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు పుట్టకుండా కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధులకు గురి కావద్దని ప్రజలను కోరినారు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా తగిన పరీక్షలు చికిత్సలు చేయించుకోవాలని కోరినారు నేడు పగిడిపల్లి లో స్వయంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించి తగు చికిత్సలు అందించి మునిసిపాలిటీ సిబ్బందిచే పరిసరాల పరిశుభ్రత పర్యవేక్షించినారు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తో ఇంటింటి సర్వే చేయించి జ్వరగ్రస్తులకు తగిన చికిత్సలు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్ సింగ్ డిప్యూటీ డెమో అనిల్ కుమార్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము సిబ్బంది పాల్గొన్నారు

Related posts

మలేరియా పై అవగాహన ర్యాలీ

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం