Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

చిన్ని కృష్ణుని ఆశీర్వదము చల్లని దీవెనతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి మంత్రి కొలుసు పార్థసారధి

 

 జై భారత్ వాయిస్ ‘ నూజివీడు నియోజకవర్గం,ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామంలో వెంచివున్న శ్రీ కృష్ణుని గుడి సన్నిధానంలో నిర్వహించిన శ్రీకృష్ణుని జన్మదిన ఏడుకల్లో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ కృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు, తొలుత వేదపండితులు అర్చకులు వారు మేల తాళలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనం చేసిన పండితులు తదనంతరం సంస్కృత కార్యక్రమాలు తిలకించిన మంత్రివర్యులు శ్రీ మురళీ కృష్ణ కోలాట భజన సంఘము వారిచే చిన్నారులతో కోలాటలు పలు సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారుల నృత్యాలు కోలాటాలు తిలకించి చిన్నారులను ఆశీర్వదించిన మంత్రివర్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పూర్వం అందరూ కలిసి మెలిసి కోలాటాలు కర్రసాము పలు సంసృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరూ కలిసి మెలిసి అన్నదమ్ములలా ఉండేవారని తద్వారా ఆరోగ్యము ఆనందము సంతోషంగా జీవించేవారని అన్నారు ఈ ఆధునిక జీవనంలో ప్రతీ ఒక్కరూ బిజీ జీతం గడపడం ద్వారా ఈలాంటి సంస్కృత కార్యక్రమాలు లేక కొంత కుటుంబ నైతిక విలువలు వుండడంలేదని ఇకనుండైన ఈ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయాలు పాటించడం మంచిదని చూసించారు తద్వారా కుటుంబ వ్యవస్థ మెరుగు పడి సహోదర ప్రేమ కల్గి తద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందని అన్నారు అది అందరికీ మంచిదని తెలిపారు ఆగిరపల్లి వేడుకలు అనంతరం *రావిచర్లలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ గారితో* కలిసి శ్రీ కృష్ణుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వడ్లమాను, రావిచర్ల, దేవరగుంట గ్రామాలలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రివర్యులు తదనంతరం భక్తులకు అన్నప్రసాధాలు వడ్డించి భక్తులకు అభివాదం చేసిన మంత్రివర్యులు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షంతో జిల్లా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సకాలంలో వర్సాలు కురిసి తద్వారా రాష్ట్ర రైతాంగం అంతా పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు శ్రీ కృష్ణుడు ఎంతో మహిమ గల దైవం అని కోరిన కోర్కెలు వెంటనే చిద్దించునని తెలిపారు శ్రీ కృష్ణుని కరుణా కటాక్షంతో నూజివీడు ప్రజలు రైతులు మరియు గొర్రెలు, మేకలు, ఆవులు, గేదలు, పశు సంపద అంతా దిన దిన అభివృద్ధి చెంది తద్వారా ప్రజలంతా ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు శ్రీ కృష్ణుడి దయతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం,అష్టైశ్వర్యాలతో సంతోసధాయకమైన జీవితం గడపాలని అన్నారు అలాగే చిన్ని కృష్ణుడి దీవెన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వవం మెండుగా ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలని అన్నారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బహుళ జాతి పరిశ్రమలు మన రాస్త్రానికి తరలి వస్తున్నాయని త్వరలో వాటిని నెలకొల్పడం ద్వారా యువతీ యువతకు లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు అపార అనుభవం దూరదృష్టి చిత్తశుద్ధి కల్గిన ఆర్ధిక నిపుణుడైన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో ముందుకెళుతుందని అన్నారు. అలాంటి నాయకుడికి ఎల్ల వేళలా శ్రీ కృష్ణుడి కరుణా కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

పంగిడమ్మ బోనాల జాతర మహోత్సవంలో మంత్రి కొలుసు పార్థసారధి.

KATURI DURGAPRASAD

ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మేల్యే తో కలిసి పంపిణి చేసిన కలెక్టర్

గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తాం..

KATURI DURGAPRASAD