Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయము ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి


జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మకూరు మండలానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు 52 లక్షల 6వేల 32 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను, 18 మంది లబ్ధిదారులకు 4 లక్షల 22వేల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, దామెర మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు 16 లక్షల 1856 విలువగల కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు,18 మంది లబ్ధిదారులకు 5 లక్షల 40 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ. సిఎంఅర్ఎఫ్ పేద ప్రజలకు వరమని గతంలో ఎమ్మెల్యే, ఎంపిల కార్యాలయాల వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడు లబ్దిదారులకు నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా 814 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 14 లక్షల 94 వేల 424 రూపాయల కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను, 609 మంది లబ్ధిదారులకు 1కోటి 93 లక్షల 61 వేల 600 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో పంపిణీ చేసామని అన్నారు.ఇప్పటివరకు పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1423 మంది లబ్ధిదారులకు 10 కోట్ల 8 లక్షల 56 వేల 249 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశామన్నారు. గతప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ వాటిని కూడా మంజూరు చేశామని అన్నారు.
నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాహాయం అందజేస్తున్నామని తెలిపారు.

Related posts

వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కడియం కావ్య

Sambasivarao

ఆత్మకూరులో గణనాధునికి ఘనంగా పూజలు

ఆత్మకూరు లో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News