Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది – జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి

(జై భారత్ వాయిస్ వరంగల్):ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీ ఆర్ టీ యు సంఘం ముందుంటుందని వరంగల్ జిల్లా సంఘం అధ్యక్షుడు ఈదునూరు రవీందర్ రెడ్డి అన్నారు ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ఉన్నత పాఠశాలలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫార్ లు ఉపాధ్యాయుల తో సభ్యత్వములను చేయించారు. నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు అన్నారు. పీఆర్ టీ యు సభ్యత్వం ఒక వరం అని అన్నారు. సమస్యల పరిష్కారంలో పి ఆర్ టి యు టి ఎస్ ముందుంటుందని, త్వరలో ఏకీకృత సర్వీసులు సాధిస్తామని ఉపాధ్యాయులకు ఎంఈఓ లు, జేఎల్,డైట్ లెక్చరర్ గా ప్రమోషన్లను ఇప్పిస్తామని, పెండింగ్ లో ఉన్నటువంటి 2 డిఏ లను, మంచి ఫిట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. జీవో 11, 12 లను సవరించి SGT ఉపాధ్యాయులకు తక్షణమే 5400 ల పీఎస్ హెచ్ఎం పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేత క్రియేట్ చేపించి ప్రమోషన్లు ఇప్పిస్తాము అని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల అధ్యక్షులు అలవాల బిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి భూక్య వీరన్న , మాజీ మండల అధ్యక్షులు నెల్లుట్ల ప్రసాద రావు, జిల్లా భాద్యులు డి.వీరన్న , మనుబోతులగడ్డ ఉ న్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాండ్ల వెంకన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్, తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

అన్నదానం చేసిన సాయి తిరుపతి రెడ్డి

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి

Sambasivarao

డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా