జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు 66 డివిజనులో వర్షాకాలంలో వచ్చు సీజన్ వ్యాధులపై స్పందన జానపద కళా రంజని వెల్ఫేర్ సొసైటీ వారిచే ఈ కాలంలో వచ్చిన వ్యాధులపై డెంగ్యూ, చికెన్ గున్యా/మలేరియా వంటి వ్యాధులపై అదే విధంగా తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై 37వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తూర్పు కోట హనుమాన్ సెంటర్ లో కళారూపాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కాంగ్రేస్ నాయకులు, కళా జాత బృందం మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
